Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold: లక్ష రూపాయల మార్కును దాటిన పసిడి ధరలు- అదే బాటలో వెండి ధరలు

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (21:24 IST)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు భారీగా పెరిగి 10 గ్రాములకు లక్ష రూపాయల మార్కును దాటాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. ఎంసీఎక్స్ ప్రకారం బంగారం 10 గ్రాములకు రూ.1,108 లేదా 1.12 శాతం పెరిగి రూ.99,500 వద్ద ప్రారంభమైంది. 
 
ఇది మునుపటి ముగింపు రూ.98,392తో పోలిస్తే.. ప్రస్తుత ధర రూ.1,00,403కి పెరిగి మొదటిసారిగా రూ.1 లక్ష స్థాయిని అధిగమించింది.శుక్రవారం మధ్యాహ్నం 12:44 గంటలకు, బంగారం రూ.99,673.00 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.30 శాతం పెరిగింది. అదనంగా, భారతదేశంలో రిటైల్ బంగారం ధరలు కూడా ఈ పెరుగుదలను ప్రతిబింబించాయి. 
 
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం, మధ్యాహ్నం 12:50 గంటల ప్రాంతంలో, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,679గా ఉండగా, 24 క్యారెట్ల చక్కటి బంగారం గ్రాముకు రూ.9,917గా ఉంది.
 
వెండి కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరించింది. కిలోకు రూ.565 లేదా రూ.1,06,450 వద్ద ప్రారంభమైంది. చివరి ముగింపు రూ.1,05,885 నుండి రూ.565 లేదా 0.53 శాతం పెరిగింది.
 
స్వల్పకాలంలో బంగారం ధరలు ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంఘటనలపై ఆధారపడి ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ. 1,00,200, రూ. 1,00,500 మధ్య ఉండవచ్చు అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments