భగ్గుమన్న ధరలు.. పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:12 IST)
పెట్రోల్ ధరలు తగ్గట్లేదు. వరుసగా పదో రోజూ ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గురువారం పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.89.88 ఉండగా.. లీటరు డీజిల్ రూ. 80.27గా కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ.96.32కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ఈ రోజు లీటరుకు రూ.91.11, చెన్నైలో రూ.91.98కు చేరింది. 
 
అలాగే హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ రూ.87.55కు చేరింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో శ్రీగంగనగర్‌లో లీటర్‌కు రూ.100కిపైగా చేరింది. కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు 12 సార్లు చమురు ధరలు పెరిగాయి. వీటితో పాటు ఇటీవల వంట గ్యాస్ ధరలు కూడా పెరగడం సామాన్యుడి నెత్తిమీద భారం పడినట్లు అయింది. ధరలు అదుపులేకుండా ఇలా పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. 
 
ధరల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రజలకు.. పెరిగిన ధరలు భారంగా మారాయని పేర్కొన్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈ బాదుడుకు కారణం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని కేంద్రం పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments