పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. ఈ నెలలో ఏడోసారి ధరల పెంపు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:01 IST)
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఐదవరోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 25 నుంచి 30 పైసలు వరకూ పెరిగింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు 35 పైసలు వరకూ పెరిగింది. దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 98.98 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 90.82 రూపాయలుగా ఉంది. 
 
మహారాష్ట్రలోని పర్బణీలో పెట్రోల్ 97.05 రూపాయలు, డీజిల్ 86.44 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 88.44 రూపాయలుగా ఉండగా, డీజిల్ 78.74 రూపాయలుగా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 94.93 రూపాయలు, డీజిల్ ధర 85.70 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments