Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ ధర తగ్గింపు .. ట్విస్ట్ పెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Webdunia
ఆదివారం, 22 మే 2022 (14:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పనిలోపనిగా వంట గ్యాస్ సిలిండరుపై రూ.200 మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఇక్కడో మెలిక పెట్టారు. 
 
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పొందిన గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. అంటే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఈ లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ధరలో రూ.200 తగ్గనుంది. 
 
ఈ తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.803కు దిగిరానుంది. ఈ 9 కోట్ల మంది లబ్ధితారుల గ్యాస్ సిలిండరుకు రూ.200 చొప్పున రాయితీని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ సబ్సీబీ 12 ఎల్పీజీ సిలిండర్ల వరకు ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ధర తగ్గింపుతో కేంద్ర ఖజానాపై రూ.6100 కోట్ల భారం పడుతుందని ఆమె గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments