Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (10:05 IST)
దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కోవలో అనే టెక్ కంపెనీలతో పాటు ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇపుడు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కంపెనీ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. అమెరికా, కెనడా దేశాల్లో పని చేసే ఉద్యోగుల్లో 3 వేల మందిని తొలగించేందుకు సిద్ధంకాగా, వీరిలో 2 వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు, మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. 
 
కంపెనీలోని అన్ని స్థాయిల ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తుంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ వాహనాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ (విక్రయాలు) లేకపోవడం, మరోవైపు, కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ఉద్యోగులను తొలగించి భారాన్ని తగ్గించుకునేలా ప్రణాళికలు రచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments