Webdunia - Bharat's app for daily news and videos

Install App

రత్నగిరి ఎస్టేట్ కాఫీలతో ప్రత్యేకమైన కాఫీ కప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్

ఐవీఆర్
గురువారం, 20 జూన్ 2024 (18:48 IST)
కాఫీ ప్రియులు, సాగుదారులు, కేఫ్ యజమానులు, స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకచోట చేర్చి, హైదరాబాద్‌లోని ద కోరమ్‌లో ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ "క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్" కార్యక్రమంను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో రత్నగిరి ఎస్టేట్ నుండి తీసుకువచ్చిన అత్యుత్తమ స్పెషాలిటీ కాఫీలను సైతం ప్రదర్శించారు. దీనితో పాటుగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ అశోక్ పాత్రేతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
 
రత్నగిరి ఎస్టేట్ నుండి ప్రత్యేకమైన కాఫీలను అందించటం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైనవారు కాఫీ కప్పింగ్ ప్రక్రియను ఆస్వాదించారు, ఇది కాఫీ యొక్క లక్షణాలను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రమాణీకరించబడిన పద్ధతి. రత్నగిరి ఎస్టేట్ నుండి 86-92 మధ్య రేట్ చేయబడిన ప్రీమియం కాఫీలు ఇక్కడ కప్పింగ్ చేయబడ్డాయి. సాధారణంగా దక్షిణ అమెరికా, ఇథియోపియన్ రకాల్లో కనిపించే అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే భారతీయ కాఫీలను రుచి చూసే అరుదైన అవకాశాన్ని ఇది అందించింది. 
 
శ్రీ అశోక్ పాత్రే మాట్లాడుతూ హై-గ్రేడ్ స్పెషాలిటీ ఇండియన్ కాఫీని పండించడంలోని సవాళ్లు, కాఫీ ప్రాముఖ్యతను వెల్లడించారు. భారతీయ కాఫీ మార్కెట్‌లు ఎలా అభివృద్ధి చెందాయో చెబుతూ రత్నగిరి ఎస్టేట్‌లో వారి కాఫీలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేసే ప్రాసెసింగ్ పద్ధతులను గురించి చెప్పారు. ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ద్వారా కొత్త కాఫీ ఉత్పత్తుల ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. 
 
ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ వ్యవస్థాపకురాలు చాందిని ఎస్‌ఆర్‌కె మాట్లాడుతూ, "ఫస్ట్ క్రాక్‌లో మా లక్ష్యం కాఫీ రైతులు, వినియోగదారుల మధ్య అంతరాన్ని తగ్గించడం, ప్రతి కప్పు పొలం నుండి కప్పు వరకు దాని ప్రయాణం వెనుక కథను చెబుతుందని నిర్ధారిస్తుంది. నేటి కార్యక్రమం భారతీయ ప్రత్యేక కాఫీ యొక్క అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments