Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO 3.0: ఏటీఎం ద్వారా ఇక పీఎఫ్ డబ్బు పొందవచ్చు.. మన్సుఖ్

సెల్వి
శుక్రవారం, 7 మార్చి 2025 (19:13 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 'EPFO 3.0' అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది, ఇది చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను నేరుగా ఏటీఎంల నుండి విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుంది.
 
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త వ్యవస్థ లావాదేవీలను సులభతరం చేయడానికి అనేక డిజిటల్ ఫీచర్లతో పాటు బ్యాంకింగ్ లాంటి సౌలభ్యాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. 
 
"రాబోయే రోజుల్లో, ఈపీఎఫ్‌వో ​​3.0 వెర్షన్ వస్తుంది. దీని అర్థం EPFO ​​బ్యాంకుకు సమానం అవుతుంది. బ్యాంకులో లావాదేవీలు జరిగినట్లే, ఈపీఎఫ్‌వో చందాదారులు యూఎన్ఏ ద్వారా అన్ని పనులను చేయగలుగుతారు. EPFO 3.0 అనేది ప్రస్తుత వ్యవస్థకు మెరుగైన వెర్షన్, ఇది విత్ డ్రా పనులను వేగవంతం చేయడానికి సాయపడుతుందని ఆయన చెప్పారు.
 
ఈ అప్‌గ్రేడ్‌తో, ఈపీఎఫ్‌వో ​​సభ్యులు తమ పీఎఫ్ డబ్బును పొందడానికి ఇకపై ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు లేదా వారి సంస్థల నుండి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. 
 
బదులుగా, వారు బ్యాంకు ఖాతా నుండి నగదును డ్రా చేసుకునేలా.. ఏటీఎంల ద్వారా తమ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. 
 
చందాదారులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉపయోగించి తమ ఖాతాలను నిర్వహించుకోగలరు. ఏటీఎంల నుంచి పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు ఎంత పరిమితి విధించబడుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments