గ్యాస్ వినియోగదారులకు షాక్: సిలిండర్ ధర రూ.1,000 వరకు పెరుగుతుందా?

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:35 IST)
ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ.1,000 వరకు పెరుగుతుందని సమాచారం. అయితే, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచడంపై అలాంటి వార్తలేవీ ప్రభుత్వం నుంచి బయటకు రాలేదు. 
 
మీడియా నివేదికల ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వం రెండు స్టాండ్‌లు తీసుకోవచ్చని తెలుస్తోంది. మొదటిది, ప్రభుత్వం ఇప్పుడున్నట్లుగానే నడుస్తుంది. రెండవది, ఉజ్వల పథకం కింద, ఆర్థికంగా బలహీనమైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలి. 
 
అయితే, సబ్సిడీ ఇవ్వడం గురించి కేంద్రం స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రభుత్వ వైఖరి గమనిస్తే.. రెండో ఆప్షన్ కేంద్రం తీసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
 
భారతదేశంలో దాదాపు 29 కోట్ల మందికి ఎల్‌పిజి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో ఉజ్జ్వల పథకం కింద దాదాపు 8 కోట్ల LPG కనెక్షన్లు ఉన్నాయి. గడిచిన ఒకటిన్నర సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments