డిజిటల్ ఇండియాలో భాగంగా... రెండు వేల రైల్వే స్టేషన్లలో భారీ స్క్రీన్లు
రైల్వేల్లో భారీ సంస్కరణలకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద సంస్కరణను చేపట్టనుంది. ఇండియాలో రైల్వేలకు ఉన్న ఆదరణ మరే రవాణా వ్యవస్థకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైళ్లు ఆలస్యంగా తిరిగి
రైల్వేల్లో భారీ సంస్కరణలకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద సంస్కరణను చేపట్టనుంది. ఇండియాలో రైల్వేలకు ఉన్న ఆదరణ మరే రవాణా వ్యవస్థకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైళ్లు ఆలస్యంగా తిరిగినా వాటిపైనే ఆధారపడేవారు ఎంతో మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో సుమారు 2వేల రైల్వేస్టేషన్లలో భారీ స్క్రీన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైళ్ల రాకపోకలు, సీట్ల వివరాలు, ప్లాట్ ఫామ్ సమాచారం తదితరాలను ఈ జెయింట్ స్క్రీన్లపై ప్రదర్శించడం ద్వారా ఆదాయం సంపాదించడంపై రైల్వేశాఖ దృష్టిసారించింది.
ఈ మేరకు రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా ఢిల్లీ, వారణాసి, గ్వాలియర్, జయపుర, గోరఖ్ పూర్ వంటి ఆరు రైల్వే స్టేషన్లలో తొలిదశలో జెయింట్ స్క్రీన్లు ఏర్పాటు చేయనుంది.