Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణాల్లో సెంచరీ కొట్టిన డీజిల్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (08:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇపుడు డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టేసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 
 
వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.
 
దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది. నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments