Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మోతమోగిస్తున్న జీఎస్టీ వసూళ్లు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (11:31 IST)
దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. డిసెంబరు నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబరు నెలలో మొత్తం రూ.1.65 లక్షల కోట్లు వసూలైనట్టు పేర్కొంది. నవంబరు నెలలో పోల్చితే డిసెంబరు నెలలో రెండు శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని తెలిపింది. 
 
నవంబరు నెలలో కూడా రూ.1.68 లక్షల కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలైన విషయం తెల్సిందే. అయితే, గత 2022 డిసెంబరుతో పోల్చితే 2023 డిసెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లలో పది శాతం వృద్ధి నమోదైంది. ఏదేమైనా వరుసగా పదో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం. 
 
డిసెంబరు నెల వసూళ్ల వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ జీఎస్టీ రూ.30,443 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.37,935 కోట్లు. సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.84,255 కోట్లు, ఇందులో దిగుమతులపై వసూలైన మొత్తం రూ.41,534 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూపంలో రూ.12249 కోట్లుగా ఇందులో దిగుమతులపై వసూలైన పన్ను రూ.1079 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదల కాబోతున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రోటి కపడా రొమాన్స్‌

శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, గెటప్స్ మెస్మరైజ్ చేస్తాయి: ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్

ఏపీలో చిరు కుటుంబానికి వైకాపా.. తెలంగాణలో నాగ్ ఫ్యామిలీని బజారుకీడ్చిన కాంగ్రెస్?

వెంకటేష్ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం : దర్శకుడు మనోజ్ పల్లేటి

తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులు : సాయి ధరమ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments