Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ మోసాలపై ఖాతాదారులకు పూర్తి రక్షణ.. పది రోజుల్లో ఖాతాలో జమ

ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్య

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (05:37 IST)
తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. 
 
మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.  ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని  ఆర్‌బీఐ వివరించింది.
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments