ఏటీఎంల నుంచి ఎన్నిసార్లైనా నగదు డ్రా చేసుకోవచ్చు...

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (16:37 IST)
డెబిట్‌ కార్డు దారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపారు.
 
మార్చి, ఏప్రిల్‌, మే నెలల జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే గడువును 2020 జూన్‌ 30 వరకూ పొడిగించారు. లాక్‌ డౌన్‌లో ఎగుమతిదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు కస్టమ్స్‌ శాఖ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుందని ఆర్థికమంత్రి వెల్లడించారు.
 
కరోనా కోరల్లో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా.. ఇకపై బ్యాంకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తారు. ఆధార్‌- పాన్‌ కార్డు అనుసంధానికి తుది గడువును 2020 జూన్‌ 30 దాకా పొడిగించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఆదాయపన్నుపై ఆలస్యమయ్యే చెల్లింపులపై విధించే వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments