Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారానికి భలే డిమాండ్..భారీగా పెరిగిన చికెన్ ధర

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:06 IST)
మాంసాహారానికి భలే డిమాండ్. ఆషాఢం, బోనాల పండుగ కావడంతో చికెన్‌కు గిరాకీ మరీ పెరిగింది. మటన్‌ ధర భారీగా ఉండటంతో చాలా మంది కోడి మాంసాన్ని తెచ్చుకొని తింటుంటారు. ఇక కిలో నాటు కోడి ధర రూ.700-750 వరకు పలుకుతోంది. బోనాల సమయంలో నాటుకోళ్లకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. కరోనా కారణంగా అందరూ రోజు గుడ్లను తింటుండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది. 
 
హోల్‌సేల్‌ దుకాణాల్లో డజన్‌ గుడ్లు రూ.65 నుంచి రూ.68 పలుకుతున్నాయి. కిరాణ దుకాణాల్లో రూ.72కు విక్రయిస్తున్నారు. అలాగే చికెన్‌ ధర కూడా కుతకుతలాడుతోంది. వారం.. వారం ధర పైపైకి ఎగబాకుతోంది. ఈ ఆదివారం కిలో చికెన్‌ ధర ఒక్కసారిగా రూ.240 నుంచి రూ.260కి చేరింది. 
 
హోల్‌సేల్‌లో రూ.240 ఉండగా, రిటైల్‌లో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. గత ఆదివారం కిలో చికెన్‌ రూ.180 నుంచి 200 లోపు మాత్రమే ఉంది. వారంలోనే కిలోకు ఒక్కసారిగా రూ.60 పెరిగింది. ఆదివారం నుంచి బోనాల పండుగ మొదలు కావడంతో హైదరాబాద్‌లో కోళ్లు, మేకలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరంభంలోనే చికెన్‌ ధర భారీగా ఉండటంతో జనం బెంబేలెత్తున్నారు. 
 
కరోనా మొదటి వేవ్‌ ఆరంభంలో చికెన్‌ ధరలు అమాం తం పడిపోయాయి. అయితే చికెన్‌ వల్ల కరోనా రాదని, ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చికెన్‌, గుడ్లు తప్పనిసరిగా తినాలని చెప్పడంతో మళ్లీ చికెన్‌ దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments