Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో బ్యాంకు స్కామ్ : పంజాబ్ సీఎం అల్లుడుపై సీబీఐ కేసు

మరో బ్యాంకు స్కామ్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.109 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (13:28 IST)
మరో బ్యాంకు స్కామ్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.109 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంకును మోసం చేసిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ కేసులోని 11 మందిలో సీఎం అల్లుడు గురుపాల్ సింగ్ ఒకరు. ఆయన కంపెనీకి డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 
 
దేశంలోని అతిపెద్ద షుగర్‌ కంపెనీల్లో పంజాబ్‌కు చెందిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ ఒకటి. దీనికి గుర్మిత్‌ సింగ్‌ మాన్‌ ఛైర్మన్‌. 2011లో ఈ కంపెనీ చెరకు రైతులకు ఫైనాన్స్‌ చేసేందుకు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి రూ.148.60 కోట్ల అప్పు తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతులకు అందజేయకుండా కంపెనీ తన అవసరాలకు వాడుకుంది. దీంతో రూ.97.85కోట్లు మొండిబకాయిగా మారింది. మార్చి 2015లో తప్పును గుర్తించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. 2015 మేలో మొండి బకాయిల జాబితాలో చేర్చింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments