Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు తాళం.. ఐదు రోజులు సేవలు బంద్

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (08:29 IST)
దేశంలోని బ్యాంకులకు తాళం పడనుంది. ఫలితంగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగనున్నారు. ఈరోజుల్లోనే ప్రభుత్వ సెలవుదినాలు కలిసి రావడంతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ అంటే శుక్రవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఆతర్వాత 22వ తేదీ నాలుగో శనివారం, 23వ తేదీన ఆదివారం, 25వ తేదీన క్రిస్మస్, 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునివ్వడం వంటి కారణాల రీత్యా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటంతో ఏటీఎం కేంద్రాల్లో కూడా నగదు నిండుకునే అవకాశం ఉంది. దీనికితోడు క్రిస్మిస్, కొత్త సంవత్సర వేడుకలు రావడంతో కస్టమర్లంతా తమ అవసరాల కోసం భారీ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. సో.. ముందే త్వరపడి నగదును విత్ డ్రా చేసుకుని నిల్వ ఉంచుకోవాలని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments