Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక వినాశనం తప్పదంటున్న ఆనంద్ మహీంద్రా!

Webdunia
మంగళవారం, 26 మే 2020 (08:43 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, గత మార్చి 25వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్డౌన‌లో వుంది. ప్రస్తుతం నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. ఈ లాక్డౌన్ కారణంగా జనజీవనంతోపాటు ప్రతి రంగం స్తంభించిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో మరోమారు లాక్డౌన్ పొడగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థ అధిపతి ఆనంద్ మహీంద్రా స్పందించారు. మరోమారు లాక్డౌన్ పొడగిస్తే ఆర్థిక వినాశనం తప్పదంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. మరోమారు లాక్డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దాలు. లాక్డౌన్‌ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కోవిడ్‌యేతర రోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉందంటూ గతంలో ఆయన చేసిన ట్వీట్లను గుర్తు చేశారు. 
 
లాక్డౌన్ పొడిగింపు వల్ల వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. లాక్డౌన్ పొడిగింపు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆనంద్ మహీంద్రా గతంలోనూ పేర్కొన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్డౌన్ ఎత్తివేయడమే మేలని ఆయన సూచించారు. నిజానికి ఈ నాలుగో దశ లాక్డౌన్‌లోనే కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను సరళతరం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments