Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులపై బాదుడే బాదుడు... పాల ధర పెంపు

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:12 IST)
సామాన్యులపై బాదుడే బాదుడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ ధర కూడా  నుంచే పెరిగింది. ఇప్పుడు వీటి సరసన పాలు కూడా వచ్చి చేరాయి. పాల ధర జూలై-1 నుంచి పెరిగింది. 
 
అమూల్ మిల్క్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. జూలై 1 నుంచి రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సీనియర అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
 
అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటికీ రేట్ల పెంపు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీంతో పాలు కొనుగోలు చేసే వారు లీటరుకు ఇప్పుడు రూ.2 అదనంగా చెల్లించుకోవాలి. అమూల్‌కు చెందిన గోల్డ్, టాజా, శక్తి, టీ స్పెషల్ వంటి పలు బ్రాండ్ల ధరలు పెరిగాయి. 
 
ఇప్పుడు లీటరు పాలు కొనాలంటే రూ.48 నుంచి రూ.58 వరకు చెల్లించుకోవాలి. పాల క్యాకేజింగ్ వ్యయాలు 30 నుంచి 40 శాతం పెరిగాయని, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ 30 శాతం పెరిగిందని ఆయన వివరించారు. అలాగే ఎనర్జీ కాస్ట్ 30 శాతం పెరిగిందని తెలిపారు. దీంతో పాల ధర పెంచాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments