Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యులకు ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. కనీస చార్జీ లేకుండానే ఫ్లైట్ జర్నీ!!

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (21:59 IST)
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలోనూ, ఈ వైరస్ సోకిన వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులకు ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కనీస చార్జీ చెల్లించకుండానే దేశంలో ఎక్కడైనా విమానంలో ప్రయాణించవచ్చని పేర్కొంది. 
 
ఈ విమానయాన సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల మేరకు... ఈ ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది. 
 
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని ప్రయాణించే వైద్యులు విమాన కనీస చార్జీ చెల్లించకుండానే ప్రయాణం చేయొచ్చు. అంటే, కనీస చార్జీ లేకుండా, కేవలం ఎయిర్‌పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. సదరు ప్రయాణికుడు దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. 
 
జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. సంప్రదింపుల వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఐడీ వంటి వివరాలు అందిస్తే ఎయిర్ ఏషియా వర్గాలు వాటిని పరిశీలించి టికెట్ మంజూరు చేస్తామని ఎయిర్ ఏషియా వాణిజ్య విభాగం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments