Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవ్ డిపాజిట్: ఎస్బీఐ నుంచి కొత్త డిపాజిట్ పథకం..

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:38 IST)
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ని సెలబ్రేట్ చేస్తూ 'ఉత్సవ్ డిపాజిట్' (Utsav Deposit) పేరుతో సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది ఎస్బీఐ. ఈ స్కీమ్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 
స్కీమ్ ప్రారంభం అయినప్పటి నుంచి 75 రోజుల వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసినవారికి ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. 
 
మళ్లీ పాత వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. ఎస్‌బీఐలో సాధారణంగా ఉండే వడ్డీ రేట్ల కన్నా ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి ఎక్కువ వడ్డీ లభించనుంది.  
 
ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడానికి 2022 అక్టోబర్ 28 వరకే అవకాశం ఉంది. 'ఉత్సవ్ డిపాజిట్' స్కీమ్‌లో డబ్బులు దాచుకునేవారికి 6.10 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ 1000 రోజులు. అంటే మూడేళ్ల లోపే. 
 
బ్యాంకులో మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మరోవైపు ఎస్‌బీఐ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments