Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి అవసరం లేదు..!!

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2012 (12:51 IST)
FILE
కేంద్ర ప్రభుత్వం కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. కమోడిటీ ఎక్చేంజీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ)ను 23 శాతం వరకు పెట్టుబడి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదని పరిశ్రమల శాఖ ప్రకటించిన నూతన ఎఫ్‌డీఐ నిబంధనావళిలో పేర్కొన్నారు.

ఇప్పటివరకు కమోడిటీ ఎక్చేంజీల్లో ప్రభుత్వ అనుమతి మార్గంలో ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐలకు 49 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 49 శాతం పరిమితిలో రిజిస్టర్డ్ ఎఫ్‌ఐఐలు 23 శాతం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎఫ్‌డీఐ విధానంలో పరిమితి 26 శాతం నిర్ణయించారు.

డీఐపీపీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే సర్క్యులర్‌ను ఇక నుంచి సంవత్సరానికి ఒకసారి ఇస్తామని ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం విదేశీ కంపెనీలు ఏదైనా రంగంలో కానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందుగా రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ అనుమతి అనంతరం ఎఫ్‌ఐఐలు 24 శాతానికి మించి వాటాను కలిగివుండవచ్చు. దీనికి ఆయా కంపెనీ బోర్డులు, వాటాదార్ల అనుమతి కూడా తీసుకోవాల్సివుంది. విదేశాల నుంచి సెకెండ్‌ హ్యాండ్‌ యంత్రాల దిగుమతిని ప్రోత్సహించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments