Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెయిల్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకొంటాం: చిదంబరం

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2010 (16:36 IST)
దేశీయ ఉక్కు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగానున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్ఏఐఎల్) సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం 20 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం గురువారం న్యూ ఢిల్లీలో వెల్లడించారు.

కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు సమావేశమైంది. ఈ సందర్భంగా క్యాబినెట్ నిర్ణయించిన విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. తమ ప్రభుత్వం సెయిల్‌ సంస్థ నుంచి రూ. 16,000 కోట్లను ఉపసంహరించుకుంటుందన్నారు. ఈ ఉపసంహరణలో భాగంగా పెట్టుబడులను రెండు విడతలుగా తీసుకుంటామని ఆయన తెలిపారు. దీని ప్రకారం తొలుత రూ. 8,000 కోట్లను ఉపసంహరించుకుంటామన్నారు.

ఇదిలావుండగా ప్రస్తుతం సెయిల్‌లో ప్రభుత్వ పెట్టుబడులు 85.82 శాతం ఉన్నాయి. ప్రభుత్వం ఇరవై శాతం సొమ్మును ఉపసంహరించుకుంటే ప్రభుత్వ వాటా 69 శాతానికి చేరుకుంటుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments