Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా పెరిగి 17.7 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2010 (15:22 IST)
FILE
మార్చి 27తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగి 17.70 శాతానికి చేరుకుంది. దేశంలో పాలు, పండ్లు, పప్పుదినుసుల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అదే అంతకు మునుపు వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 16.35 శాతంగా ఉండింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతోపాటు ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. మార్చి నెల ద్రవ్యోల్బణ సూచీ వచ్చే వారాంతానికి రాగలదని, ఇందులో రెండు అంకెలకు చేరుకోగలదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

అదే ఫిబ్రవరి నెలకు చెందిన మాసిక ద్రవ్యోల్బణంలో ఆహార, ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 9.89 శాతానికి చేరుకుంది. ఇదే వార్షిక ద్రవ్యోల్బణం పరిస్థితి గమనిస్తే పప్పు దినుసులు 32.60 శాతం, పాలు 21.12 శాతం, పండ్లు 14.95 శాతం, గోధుమలు 13.34 శాతానికి ఎగబాకాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments