వంద బిలియన్ డాలర్లతో అత్యంత వేగంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ బిబి ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో దేశీయ ఔట్సోర్సింగ్ మార్కెట్ కూడా విస్తృతమవుతోందని బిబి ఆర్ మోహన్ రెడ్డి అన్నారు.
దేశంలో ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాకుండా వివిధ పరిశ్రమల్లో, సేవా రంగంలో రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయని మోహన్ రెడ్డి చెప్పారు.