Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యంపై దిగుమతి సుంకం రద్దుచేసిన కేంద్రం

Webdunia
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం బియ్యంపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

దేశీయ మార్కెట్లో నిత్యావసర సరుకుల దిగుమతులను పెంచుకోవడం కోసం ప్రధానంగా బియ్యంపై దిగుమతి సుంకాన్ని రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడం, బియ్యం ఉత్పత్తులు తగ్గవచ్చునన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతమున్న 70 శాతం దిగుమతి సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించాలని, వచ్చే ఏడాది సెప్టెంబరు దాకా దీనిని కొనసాగించాలని గత నెలలో సమావేశమైన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల సాధికారిక గ్రూపు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గతంలో 2008 మార్చి 20న ఒకమారు ప్రభుత్వం బియ్యంపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దానిని పునరుద్ధరించారు. పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మంత్రుల గ్రూపు నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments