Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరగనున్న పెట్రోలు ధరలు, నేటినుంచే అమలు : ప్రణబ్

Webdunia
FILE
గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ అందించిన నివేదకను అమలు చేస్తామని, ఇందులో భాగంగా పారిఖ్ కమిటీ సూచన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఎక్సైజ్ సుంకుం రెండు శాతం పెంచడంతో ఈ పెరుగుదల నేటి నుంచే అమలు కానుంది.

పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచేందుకు సిద్ధంగానున్నట్లు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రకటించడంతోపాటు పారిఖ్ కమిటీ అందించిన నివేదికను తాము అమలు చేస్తున్నామన్నారు. దీంతో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. పెట్రో ధరల పెంపుపై సభలో గందరగోళం చెలరేగింది.

ఇదిలావుండగా కిరీట్ పారిఖ్ కమిటీ సూచన మేరకు ఎక్సైజ్ సుంకం పెంపు నేటి నుంచే అమలులోకి రానుంది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రతి లీటరుకు దాదాపు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా ఎక్సైజ్ సుంకాన్ని రెండు శాతం మేరకు పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. పెట్రోలు, డీజిల్‌తోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగనున్నాయి. సిగరెట్లు, మద్యం, సిమెంట్ ధరలు కూడా పెరుగుతాయి. అలాగే లగ్జరీ కార్లపై ఎక్సైజ్ సుంకం దాదాపు 22 శాతం పెరిగింది. ఈ పెరుగుదల ఈ రోజునుంచే అమలులోకి వస్తుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments