పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఊపందుకోవడంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. మంగళవారం న్యూఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారంపై రూ.280 పెరిగి వరుసగా రూ.30,930 మరియు రూ.30,730గా నమోదయ్యింది. ఇంతక్రితం రెండు సెషన్లలో పది గ్రాముల బంగారంపై రూ.480 పెరుగుదల చోటు చేసుకుంది. కిలో వెండిపై రూ.1,250 పెరిగి రూ.49,950గా పలికింది. 100 వెండి నాణేలపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.87,000కు చేరుకున్నాయి.