Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ప్రీమియం బైక్ : ఎమ్ అండ్ ఎమ్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2010 (18:44 IST)
దేశీయ ఆటో నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మహీంద్రా అండ్ మహీంద్రా ( ఎమ్ అండ్ ఎమ్ ) దేశీయ మార్కెట్లో ప్రీమియం బైక్‌ను ప్రవేశ పెట్టనుంది.

రానున్న రోజుల్లో తమ సంస్థ ప్రీమియం బైక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధ్యక్షుడు అనూప్ మాథుర్ మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీమియం బైక్‌‌‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు అంతర్జాతీయ బైకుల కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికిగాను బ్రిటన్‌కు చెందిన ట్రైయంఫ్, ఇటలీకి చెందిన మోటో గుజీ సంస్థలున్నాయి. ప్రీమియం బైక్‌కు సంబంధించి తమ కంపెనీ ఇప్పటికే ఒక మోడల్‌ను తయారు చేసిందన్నారు.

ప్రస్తుతం దేశంలోనున్న ద్విచక్ర వాహన నిర్మాణరంగంలోనున్న పలు కంపెనీలకు ధీటుగా మార్కెట్లోకి చొచ్చుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైయంఫ్ కంపెనీ 1902 నుంచి ఉత్పత్తులను ప్రారంభించి అమ్మకాలలో ముందుందన్నారు. అలాగే మోటో గుజీ సంస్థ 1921 నుంచి ద్విచక్ర వాహనాల ఉత్పత్తులలో ముందుందన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments