Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహరుణాలు పొందేవారికి శుభవార్త: ప్రణబ్

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (14:18 IST)
దేశంలో గృహరుణాలు పొందేవారికి ఒకశాతం వడ్డీలో రాయితీనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దేశంలో గృహనిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహరుణాలపై ఒకశాతం వడ్డీని రాయితీగా ప్రకటించారు. దీనికిగాను గృహనిర్మాణ రంగానికి రూ. 700 కోట్ల(రూ. 7 బిలియన్లు) సహాయనిధిని వచ్చే ఆర్థిక సంవత్సరం(2010-11) బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు.

గృహ రుణాల నిమిత్తం బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలలో రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మేరకు తీసుకునే రుణాలకు ఒక శాతం వడ్డీని సబ్సిడీగా గత సంవత్సరం ఆర్థిక సహాయనిధి క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఆయన సభలో ప్రకటించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments