భారత్లో అతిపెద్ద ద్రవీకృత సహజవాయువు దిగుమతిదారు (ఎల్ఎన్జీ) "పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్" ఆస్ట్రేలియాలోని గోర్గాన్ ప్రాజెక్టు నుంచి ఇంధన దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి పెట్రోనెట్ ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోనుంది.
ఎక్సొన్ మొబిల్ కార్పొరేషన్ నుంచి 20 ఏళ్లపాటు ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలను పెట్రోనెట్ ఖరారు చేసుకుందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రసాద్ దాస్గుప్తా పీటీఐతో చెప్పారు.
గ్యాస్ అమ్మకాలు, కొనుగోలు ఒప్పందం (జీఎస్పీఏ)పై జూన్ 30లోగా సంతకాలు చేస్తామని తెలిపారు. కేరళలో నిర్మాణంలో ఉన్న కోచి టెర్నినల్ నుంచి పెట్రోనెట్ ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోనుంది.