కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి విడుదల చేసిన ఆకాష్ టాబ్లెట్ పీసీ తయారీ ధర కేవలం 1750 రూపాయలేనని వీటిని తయారు చేసిన డాటావిండ్ కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రభుత్వం పన్నులు, వారంటీల కారణంగా దీని ధరను రూ.2276కు విక్రయిస్తోందని ఆ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ వెల్లడించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ ఆకాష్ను రూ.1750కే తయారు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, రిపేర్ చేయడానికి అధికంగా ఖర్చు అవుతుండటంతో ప్రత్యేకంగా రీప్లేస్మెంట్ వారెంటీ ఇవ్వాలని ప్రభుత్వం కోరిందన్నారు.
పైపెచ్చు. ప్రభుత్వం వివిధ రకాల పన్నులు విధించడం వల్ల దీని ధర రూ.2,276లకు పెరిగిందని తెలిపారు. ఈ టాబ్లెట్ పీసీని చైనాలో విడుదల చేసిన అనంతరం ఇక్కడినిక తీసుకుని వచ్చినట్టయితే పన్నుల నుంచి మినహాయింపు ఉండేదన్నారు.