ప్రపంచంలో అనేక మంది అపర కుబేరులు ఉన్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అలాంటి వారిలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్జీలు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో పి.ఎన్.సి.మీనన్ కూడా చేశారు.
శోభా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడైన మీనన్ భారతీయుడే అయినప్పటికీ.. దుబాయ్ కేంద్రంగా తన వ్యాపారసామ్రాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించారు. అయితే, దాతృత్వ కార్యక్రమాల విషయంలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్జీ, మీనన్లను మార్గదర్శకంగా తీసుకున్న మీనన్.. తన సంపదలో సగభాగం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈయన సంపద విలువ సుమారు రూ.3500 కోట్లుగా ఉంటుందని అంచనా.