రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ రెడీ!

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:25 IST)
రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చిందని కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ 2016-17ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇది ప్రజా రైల్వే బడ్జెట్‌గా సురేశ్ ప్రభు అభివర్ణించారు. రక్షణ  లేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించే దిశగా ప్రయత్నిస్తున్నామని సురేశ్ ప్రభు వెల్లడించారు. 
 
ఇకపోతే.. పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టామని, సమయపాలన వసతులకు ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. సామాన్యుల ఆకాంక్షకు ప్రతిబింబంగా రైల్వే బడ్జెట్ ఉంటుందన్నారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే  సగటున 50. కి.మీ ఉన్న వేగాన్ని 80 కి.మీగా పెంచామని మంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది పది శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments