Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ కార్లు, సిగరెట్లు మరింత ప్రియం.. గృహోపకరణాల ధరల్లో తగ్గుదల

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:55 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఆయన సోమవారం లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచనున్నట్టు ప్రకటించారు. దీంతో సిగరెట్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. 
 
అలాగే, రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న కంపెనీలకు 10 శాతం సర్‌చార్జ్‌ విధిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో లగ్జరీకార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వ్యసాయరంగ అభివృద్ధి కోసం 0.5 శాతం పన్ను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాక కార్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌‌ను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆభరణాలపై ప్రత్యేక లెవీ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. 
 
అదేసమయంలో గృహోపకరణాలు, రిప్రెజిరేటర్స్‌ ధరలు తగ్గనున్నాయని తెలిపారు. వికలాంగుల కోసం తయారు చేసే ఉత్పత్తులపై ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నామని అన్నారు. పెన్షనర్లకు ట్యాక్స్‌ మినహాయింపు నిచ్చామన్నారు. 
 
గృహ రుణం తీసుకునేవారికి అరుణ్ జైట్లీ వరాలు కురిపించారు. రూ.35 లక్షలలోపు హౌసింగ్‌లోన్‌ తీసుకునేవారికి రూ.50 వేలు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఇన్‌కంట్యాక్స్‌ లిటిగేషన్లను తగ్గిస్తామని జైట్లీ హామినిచ్చారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments