ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.. భారత్ సూపర్ : అరుణ్ జైట్లీ

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (11:13 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌ను సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌‍సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలోనే ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని గుర్తు చేశారు. గత 2014లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండగా, 2015లో ఇది 3.1 శాతానికి దిగజారిందని ఆయన గుర్తు చేశారు.
 
అయితే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్ ఆర్థిక వృద్ధిరేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొందని అరుణ్ జైట్లీ సభకు తెలిపారు. గత 21 నెలలుగా తాము తీసుకున్న అనేక చర్యల వల్ల వృద్ధిరేటు పెరిగిందన్నారు. దేశ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిందన్నారు.
 
ఈ క్రమంలో తమకు ఎదురవుతున్న అనేక సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును గణనీయంగా తగ్గించినట్టు తెలిపారు. అలాగే, గత రెండేళ్ళుగా వర్షాభావ పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని, ప్రస్తుతం వర్షాభావం 13 శాతంగా నమోదైందని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో చిరంజీ నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

Show comments