దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947వ సంవత్సరంలోనే రైల్వే బడ్జెట్ ప్రారంభమైంది. తొలిసారిగా రైల్వే బడ్జెట్ను జాన్ మతాయ్ సమర్పించారు. కేంద్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన జాన్ మతాయ్ రైల్వేమంత్రిగా కూడా ఉన్నారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ మొదటిసారి రైల్వే బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. 1947 నుంచి ఇప్పటివరకూ మొత్తం 30 మంది రైల్వే మంత్రులుగా పనిచేశారు.
రైల్వే మంత్రి పేరు వారి పదవీ కాలం : 1. జాన్ మతాయ్ 1947 (నవంబర్) ..... తమిళనాడు 2. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ 1948-1952... తమిళనాడు 3. లాల్ బహాదుర్ శాస్త్రి 1952-1956 ..... ఉత్తరప్రదేశ్ 4. బాబూ జగజ్జీవన్ రాం 1956-1962 ..... బీహార్ 5. స్వరణ్సింగ్ 1962 ..... పంజాబ్ 6. హెచ్.సి. దాసప్ప 1964-1965 ..... కర్ణాటక 7. ఎస్కె.పాటిల్ 1965-1967 ..... మహారాష్ట్ర 8. కెంగళ్ హనుమంతయ్య 1967-1971 ..... కర్ణాటక 9. చెప్పుదిర ముత్తన పునాచా 1968 ..... కర్ణాటక 10. రాం సుభాగ్ సింగ్ 1969-1970 ..... పంజాబ్ 11. పనంపిళ్లై గోవింద మీనన్ 1969 ..... కేరళ 12. గుల్జారీలాల్ నందా 1970-1971 ..... ఉత్తరప్రదేశ్ 13. టోన్సే అనంత్ పాయ్ 1972-1973 ..... కర్ణాటక 14. లలిత్ నారాయణ్ మిశ్రా 1973-1975 ..... బీహార్ 15. కమలాపతి త్రిపాఠీ 1975-77, 80 ..... ఉత్తరప్రదేశ్ 16. మధు దండావతే 1977-1979 ..... మహారాష్ట్ర 17. కేదార్ పాండే 1980-1981 ..... బీహార్ 18. పి.సి. సేథీ 1982-83(తాత్కాలిక) ..... మధ్యప్రదేశ్ 19. ఎ.బి.ఎ. ఘనీఖాన్ చౌదరి 1982-1984 ...... పశ్చిమ బెంగాల్ 20. బన్సీలాల్ 1984 ..... హర్యానా 21. మాధవరావు సింధియా 1984-1989 ..... మధ్యప్రదేశ్ 22. జార్జి ఫెర్నాండెజ్ 1989-1990 ..... బీహార్ 23. జ్ఞానేశ్వర్ మిశ్రా 1990-1991 ..... బీహార్ 24. జాఫర్ షరీఫ్ 1991-1995 ..... కర్ణాటక 25. సురేష్ కల్మాడీ 1995-1996 ..... ఢిల్లీ 26. వాజ్పేయి 1996 ..... ఉత్తరప్రదేశ్ 27. రామ్విలాస్ పాశ్వాన్ 1996-1998 ..... బీహార్ 28. నితీష్కుమార్ 1998-1999 ..... బీహార్ 29. మమతా బెనర్జీ 2000-2001 ..... పశ్చిమ బెంగాల్ 30. నితీష్కుమార్ 2001-2004 ..... బీహార్ 31. లాలూప్రసాద్ యాదవ్ 2004-2009 ..... బీహార్ 32. మమతా బెనర్జీ 2009 నుంచి ..... పశ్చిమ బెంగాల్