Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితా దశాబ్ది సంకలనం

Raju
సోమవారం, 15 సెప్టెంబరు 2008 (19:19 IST)
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ పెన్నా శివరామకృష్ణల సంపాదకత్వంలో వెలువడిన 'కవితా దశాబ్ది' సంకలనంలో వైవిధ్యంతో కూడిన కవితలు చోటు చేసుకున్నాయి. వీటి నేపధ్యం విషయానికి వస్తే.. భారత దేశంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది.

ఈ విధానాల కారణంగా దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి అనేక మంది కవులు, కవయిత్రుల కలాలకు పదును పెట్టాయి. దళితవాదం స్త్రీవాదం, కులతత్వం, ఆత్మగౌరవ పోరాటాలు, సాంస్కృతిక కాలుష్యం, విప్లవ రాజకీయాలు ఇత్యాదులన్నీ కవితా వస్తువులయ్యాయి. ఇవే కవితా దశాబ్ది సంకలనంలోని కవితలకు నేపథ్యంగా మారాయి.

ఇది నూటయాభైమంది కవులు కవయిత్రుల కవితా సంకలనం. 1991-2000 సంవత్సరాల మధ్య దేశంలో జరిగిన మార్పులను ప్రతిబింబిస్తూ ఈ సంకలన రచయితలు తమ భావాలను అక్షరీకరించారు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఊర్మిళా దేవి నిద్రకు రామాయణంలో విశిష్ట స్థానం ఉంది. ఊర్మిళను విడిచిన మర్నాడు అనే కవితలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ లక్ష్మణుడి కర్తవ్య దీక్షకు కొత్త నిర్వచనం ఇస్తూ ఇలా కవిత్వీకరించారు. "స్వప్నాలకు రెక్కలు కత్తిరించడమే అన్ని కర్తవ్యాల పరాకాష్ట"

లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు సహజమైన మన సమాజంలో స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో అవాంఛనీయమైన మార్పులు వస్తున్నాయి. స్త్రీల పట్ల వివక్షత గురించి భావగంభీరంగా శిక్షాపత్రం కవితలో ఘంటసాల నిర్మల ఇలా అంటారు. "ఆమె -అమ్మ-కు ఆలోచించే మెదడేది?" అన్ని ప్రశ్నిస్తూనే 'వెర్రెత్తిన నాగరికత చేతిలో చిట్లిన చిన్నారి ప్రాణం.. ఎర్ర మరకై మిగులుతుంది.." అని ముగిస్తారు.

మరో కవితలో మద్దెల శాంతయ్య.. మతం మారినంత మాత్రాన మనస్తత్వాలు మారవని సమాజపు పోకడను ఎత్తి చూపారు. తను రాసిన ఒ.సి క్రీస్తు కవితలో "మాల ఫాదరీ, సాలె ఫాదరీ, కమ్మ ఫాదరీ, కమ్మ సిస్టరమ్మ, రెడ్డి సిస్టరమ్మ'లు ఉన్నందుకే 'ఒ.సి క్రీస్తు'ను మాల క్రీస్తుగానో మాదిగ క్రీస్తుగానో రమ్మని ప్రార్థిస్తుంటాం" అనే చరణాలు సభ్యసమాజాన్ని ఒక కుదుపు కుదుపుతాయి.

' ఇరవయ్యో శతాబ్దంలోని చివరి దశాబ్దం ఇరవై ఒకటవ శతాబ్దానికి ప్రవేశద్వారంగా అమరింది' అంటూ ఈ కవితా సంపుటి సంపాదకులు చేసిన వ్యాఖ్య సారాంశాన్ని పాఠకులు ఆదరించాలి మరి.

కవితా దశాబ్ది పేజీలు 332. ధర.150 రూపాయలు
లభ్యమయ్యే చోటు అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments