Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మానికి నిగారింపు చేకూర్చే ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకోండి.

పూర్వ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు,

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (15:59 IST)
మినపప్పు, పసుపు పేస్ట్ :
పూర్వ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 
 
కళకళలాడేందుకు మినపప్పు ఫేషియల్ :
అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నిర్జీవంగా కనిపించే చర్మానికి యౌవనాన్ని ఇచ్చేదే మినపప్పు. రెండు స్పూన్ల మినపప్పులో కాస్త నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు చర్మానికి పూసి స్నానం చేస్తే చర్మం అందంగా యౌవన్నంగా కనిపిస్తుంది.
 
రోస్ వాటర్, మినపప్పు :
రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌తో నాలుగు స్పూన్ల పాలు, రెండు స్పూన్ల రోస్ వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రపరచాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందమైన, ఆకర్షణమైన ముఖం మీ సొంతం అవుతుంది. 
 
మచ్చలు మాయం కావాలంటే
మినపప్పు 1 టీస్పూన్, మిరియాల గింజ ఒకటి తీసుకోని ఒక టీస్పూన్ పాలులో ఊరబెట్టాలి. దీనితో పాటు కాల్ టీస్పూన్ ముల్తాని మట్టిని చేర్చి కలపాలి. ఈ మిశ్రమాని ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.
 
జిడ్డు చర్మానికి
జిడ్డు చర్మం ఉన్నవారు మినపప్పుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది. 
 
డల్‌గా ఉన్న ముఖం కోసం
తోలుతోపాటు ఉన్న మినపప్పు అరకిలో, తులసీ ఆకులు 50 గ్రాములు, వేపాకులు 5 గ్రాములు తీసుకొని వీటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేయాలి. ఒక పాత్రలో ఈ మిశ్రమాన్ని రెండు స్పూన్లు తీసుకొని అందులో రెండు చుక్కలు నిమ్మరసం చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఐదు నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది వారానికి ఒక్కసారి వేస్తే చాలు కళకళలాడుతూ మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments