ఇంట్లో పనిచేసే మహిళలు చేతులు ఎలా వున్నాయో చూశారా?

చాలామంది మహిళలు ఇంటి పనిలో నిమగ్నమయిపోయి వారి ఆరోగ్యం, అందం గురించి అసలు పట్టించుకోరు. దీనివలన వారి చర్మం కాంతి విహీనంగా, పొడిబారినట్లు తయారవుతుంది. ముఖ్యంగా వంటపని ఎక్కువుగా చేసేవారిలో చేతులు మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. ఈ సమస్యను అధ

Webdunia
శనివారం, 14 జులై 2018 (19:22 IST)
చాలామంది మహిళలు ఇంటి పనిలో నిమగ్నమయిపోయి వారి ఆరోగ్యం, అందం గురించి అసలు పట్టించుకోరు. దీనివలన వారి చర్మం కాంతి విహీనంగా, పొడిబారినట్లు తయారవుతుంది. ముఖ్యంగా వంటపని ఎక్కువుగా చేసేవారిలో చేతులు మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.
 
1. వేడి నీళ్లు : చేతులు నీళ్లలో ఎక్కువుగా నానడం మంచిదికాదు. అలాగే చేతుల్ని పదేపదే చల్లటి నీళ్లలోనూ ఉంచకూడదు. ఎక్కువ పనులు చేసేవారు చేతులు కడుక్కోవడానికి గోరువెచ్చని నీరు వాడటం మంచిది.
 
2. క్రీంలు : చేతులకు రాసుకునే క్రీంలు ఎప్పుడూ బ్యాగ్‌లోనే ఉండాలి. ప్రతి మూడు, నాలుగు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. దీనివల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది.
 
3. నూనె : పనులు ఎక్కువుగా చేసేవారు ప్రతిరోజు రాత్రి పూట పడుకునే ముందు చేతులకు, వేళ్లకు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో మర్దన చేయాలి. కాసేపయ్యాక గ్లవుజులు వేసుకోవాలి. మర్నాడు చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన రోజంతా పనిచేసి బరకగా మారిన చేతులకు తేమ అంది ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. పెట్రోలియం జెల్లీ : ఇప్పటికే చేతులు బాగా బరకగా మారి, మృదుత్వాన్ని కోల్పోయి ఉంటే మాత్రం వాటికి ఎంత తేమ అందిస్తుంటే అంత మంచిది. ముఖ్యంగా పెట్రోలియం జెల్లీ బాగా రాయాలి. ఇది జిడ్డుగా ఉండటం వల్ల పొడిబారిన సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments