వేసవిలో కలబంద, మజ్జిగ పూతతో ఎంత మేలు..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:02 IST)
వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కలబంద పూతే మేలు. పావుకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా విటమిన్‌ ఈ నూనె, చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి పూత వేసుకోవాలి.


విటమిన్‌ ఈ నూనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పిగ్మెంటేషన్‌ నివారణకు తోడ్పడుతుంది. నిమ్మరసం మృత కణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. కలబంద చర్మానికి తేమను సమకూరుస్తుంది.
 
వేసవిలో రోజూ ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఇది శరీరంలోని మలినాలు తొలగిస్తుంది. దీంతో చర్మం తాజాగా, నిగనిగలాడుతుంది. మజ్జిగను తాగడం లేదా మజ్జిగతో చర్మానికి పూత వేసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
మజ్జిగలో లాక్టిక్‌ ఆమ్మం ఎక్కువ. ఇది ముఖంపై ఉండే మృతకణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. మజ్జిగను దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్‌లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

తర్వాతి కథనం
Show comments