Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీపార్లర్లకు ఎందుకు..? మచ్చలు, మొటిమలు తగ్గాలంటే?

పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. అందులోనే నిమ్మరసం కలుపుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు ఆవిరి పట్టాల

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:22 IST)
పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. అందులోనే నిమ్మరసం కలుపుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. పొడి బట్టతో తుడుచుకున్నాక బౌల్‌లో వున్న పంచదార మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేసుకుంటూ.. మొటిమలు వున్న చోట శుభ్రం చేసుకుంటూ కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మానికి గ్లో వస్తుంది. మచ్చలు. మొటిమలు తగ్గిపోతాయి. బ్యూటీపార్లర్ల వెంట తిరగాల్సిన అవసరం వుండదు. 
 
అలాగే చర్మపు మృతకణాలు తొలగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి అందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.

చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments