బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:07 IST)
చర్మ సౌందర్యానికి క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ చాలానే ఉండొచ్చు. కానీ, వాటిని ఎన్ని రోజులని ఉపయోగిస్తాం.. అవి ఎంత అందుబాటులో ఉంటాయని ఎవ్వరు చెప్పలేం. చర్మానికి అందం, తాజాదనం రావాలంటే.. బియ్యం పిండి ఉపయోగిస్తే చాలంటున్నారు. బియ్యం పిండికి చర్మంలో అదనంగా ఉండే సిబమ్‌ను పీల్చి వేయడం ద్వారా చర్మాన్ని నిర్మలంగానూ, మృదువుగానూ తయారుచేస్తుంది.
 
బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ప్రత్యేకించి ముఖంలోని కండరాలు రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. దీని ఫలితంగా అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. ఇలాంటి పిండితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
పావుకప్పు బియ్యం పిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం అందాన్ని సంతరించుకుంటుంది. బియ్యం పిండిలోని యాసిడ్, అల్లాన్ టాయిన్ వంటి ఖనిజాలు చర్మంపైగల మృతుకణాలను తొలగిస్తాయి. 
 
స్నానానికి ముందు బియ్యం పిండిని వాడి సంప్రదాయం అప్పటి నుండే వస్తుంది. ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడుతాయి. బియ్యం పిండిలో కొద్దిగా అరటి పండు గుజ్జు, ఆముదం కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచు చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments