Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప, పసుపు, పెరుగులతో మొటిమలను తొలగించవచ్చు...

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (14:49 IST)
నేటి తరుణంలో చాలామంది మెుటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు ఎన్ని క్రీమ్స్, ఫేస్‌మాస్క్స్ వేసుకున్నా ఫలితాలు కనిపించలేదని చింతన. మరి ఏం చేయాలి దేవుడా అంటూ మొరపెడుతుంటారు. ఈ చిన్న విషయానికే దేవుడిని డిస్టప్ చేయడం ఎందుకు.. ఇంట్లో చిట్కాలు పాటిస్తే ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మరి అవేంటో తెలుసుకుందాం...
 
1. వేపాకులను నీటిలో మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచు చేస్తే మెుటిమ సమస్య పోవడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. 
 
2. బియ్యం కడిగిన నీటిని మెుటిమలపైన మృదువుగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తే మెుటిమలు తగ్గుతాయి. అలానే కస్తూరి పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
3. స్నానానికి ముందుగా చర్మానికి పసుపు రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే మెుటిమలు తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా.. చల్లని నీటిలో ముఖం కడుక్కోవాలి. లేదంటే సమస్య ఎక్కువైపోతుంది. 
 
4. పావుకప్పు పెరుగులో కొద్దిగా వంటసోడా కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెుటిమలు రావు. చర్మం కాంతివంతంగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments