Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ తొక్కల పొడిని ముఖానికి రాసుకుంటే?

చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమ

Webdunia
సోమవారం, 9 జులై 2018 (16:25 IST)
చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తేనెలో పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బొప్పాయి జిడ్డుని తొలగించి మెుటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
 
దీనికోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. రెండు చెంచాల నారింజ తొక్కల పొడికి తగినన్ని నీళ్లు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మెుటిమలు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. 
 
అరటిపండు తొక్కని ముఖంపై వలయాకారంగా 15 నిమిషాల పాటు రుద్దుకోవాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పచ్చి బంగాళాదుంపని ముక్కలుగా కోసి ఆ ముక్కతో ముఖంపై మలయాకారంగా 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆరాక వెచ్చని నీళ్లతో కడిగేస్తే మెుటిమలు తగ్గుముఖం పడుతాయి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments