ముల్తానీ మట్టితో క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ కలిపి రాసుకుంటే?

ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్‌తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఇదీ ఒకటి. ముల్తానా మట్

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (11:32 IST)
ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్‌తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఇదీ ఒకటి. ముల్తానా మట్టి, రోజ్ వాటర్, గంధం పొడి సమాన మొత్తాలలో తీసుకుని కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. సహజంగా ఆరిపోయిన అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 
 
పొడి చర్మం ఉన్న వారు మట్టిలో చెంచా తేనె, ఒక చెంచా బాదం నూనె, అర చెంచా మీగడ, గులాబీ నీరూ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పూర్తిగా ఆరకుండానే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అందిస్తుంది.
 
ముల్తానా మట్టి, క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చల మీద రాయాలి. 20 నిమిషాల అనంతరం శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకసారి..లేదా రెండుసార్లు చేస్తే మచ్చలు దూరమవుతాయి.
 
చర్మం సాగినట్లు అనిపిస్తున్న వారికి అరకప్పు ముల్తాని మట్టి, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఓట్స్, రెండు చెంచాల టమాటా గుజ్జులను తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నింటినీ మెత్తగా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఓ పావు గంట ఆగిన తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖానికి బాదం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి

నారా దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడు.. నారా లోకేష్

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఎంకె స్టాలిన్‌తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?

వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

తర్వాతి కథనం
Show comments