పెరుగు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:08 IST)
జిడ్డుచర్మం ఉన్నవాళ్లు నాలుగైదు బాదంగింజలు తీసుకుని రాత్రంతా నీళ్లలో నానపెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసుకుని.. అందులో అరస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే జిడ్డుపోయి చర్మం మెరుస్తుంది. రోజూ ఓట్‌మీల్ పిండిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకునట్లైతే ముఖచర్మం మృదువుగా మారుతుంది.
 
ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్, స్పూన్ నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించిన తరువాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగినట్లైతే ముఖం మృదువుగా మారి ఆకర్షణీయంగా వుంటుంది.
 
కప్పు మెంతులు నానబెట్టుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, స్పూన్ పసుపు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

తర్వాతి కథనం
Show comments