Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం నూనెను మెడభాగానికి రాసుకుంటే..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:22 IST)
ముఖం అందంగా కనిపించాలని ఏవేవో మాస్కులు, క్రీమ్స్ ఉపయోగిస్తుంటాం. అయితే మెడ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తాయి. కాలుష్యం, సౌందర్యసాధనాల్లోని రసాయనాల వలన మెడ నల్లగా మారుతుంది. ముఖంతో పాటు మెడ కూడా మెరిసేలా చేయాలంటే.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి...
 
బాదం నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ ఇ చర్మానికి కాంతినిస్తుంది. ప్రతిరోజూ బాదం నూనెను మెడభాగానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడభాగం తెల్లగా మారుతుంది. 
 
బంగాళదుంపలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదం చేస్తాయి. ముఖ్యంగా చర్మానికి కాంతిని అందించే గుణాలు ఇందులో ఎక్కువే. బంగాళదుంప రసాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. మెడభాగం తెల్లగా తయారవుతుంది.
 
కలబందలోని విటమిన్స్, మినరల్స్ చర్మం రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కలబంద గుజ్జుతో మెడభాగంలో మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై నీటితో కడిగేస్తే మెడ నల్లగా మారడం తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments