Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలం: మందార పువ్వు పేస్టుతో బంగారంలా మెరిసే చర్మం..

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:50 IST)
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మ సమస్య. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఎలాంటి సింథటిక్ కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. మందార పువ్వు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందార మన చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహకరిస్తుంది. 
 
మందార పువ్వును ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో తేనె, కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. మందార పొడిని తయారు చేయలేని వారు పువ్వును రాత్రంతా నీటిలో బాగా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసే ముందు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముఖాన్ని ఆవిరి పట్టాలి. దీంతో చర్మంలోని మురికి తొలగిపోతుంది. 
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా తుడుచుకుని కలిపిన పేస్టును అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత ఒకరోజు పాటు ముఖానికి ఎలాంటి సబ్బు వాడకూడదు. అప్పుడే అది అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా వారానికోసారి చేస్తే మన ముఖం బంగారంలా మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments