Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మసౌందర్యాన్ని పెంచే బ్యూటీ చిట్కాలు...

మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్త

Webdunia
బుధవారం, 25 జులై 2018 (11:55 IST)
మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
గంధం పొడిలో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం, టమోటా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుకోవాలి. ఇలా చేయడం వలన ముఖచర్మం మృదువుగా మారుతుంది. బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటి పొట్టును తీసి బాదం పప్పులను పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి.
 
పెరుగులో నారింజ రసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బంగాళాదుంప పొట్టును జ్యూస్‌లా చేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments