Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృదువైన చర్మం కోసం... ఏం చేయాలి?

వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా త

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (21:52 IST)
వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా తిరగడం వలన చర్మంపై మృతకణాలు పేరుకుపోయి చర్మం నలుపుగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
 
1. ఒక టమోటా తీసుకొని దానిని మెత్తగా పేస్టులా చేయాలి. దానికి ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగును కలిపి దానిని ముఖానికి పట్టించాలి. ఇలా క్రమంతప్పకుండా వారంలో మూడురోజుల పాటు చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
2. కొద్దిగా టమోటా గుజ్జులో పంచదారను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకోవాలి తరచూ ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
 
3. టమోటా గుజ్జును తీసుకొని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ టమోటా ఐస్ క్యూబ్‌తో మృదువుగా మర్దన చేయాలి. ఇది ఎండ వలన కమిలిపోయిన చర్మానికి స్వాంతన చేకూర్చి సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా కాపాడుతుంది. ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది.
 
4. టమోటా గుజ్జు, కమలా పండు గుజ్జు, కీర రసాన్ని సమాన పరిమాణంలో కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకొని సుమారు అరగంట తర్వాత ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన పిగ్మెంటేషన్ సమస్య చాలావరకు దూరం అవుతుంది. ముఖం ఛాయ మెరుగవుతుంది. చర్మ గ్రంధులు శుభ్రపడతాయి.
 
5. టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

తర్వాతి కథనం
Show comments